[1] ఇస్రాయీ'ల్ సంతతి వారు అసలు సిరియా (షామ్) ప్రాంతపు వాసులు. యూసుఫ్ ('అ.స.) కాలంలో వారు ఈజిప్టులో స్థిరపడ్డారు. కాలచక్రంలో ఈజిప్టురాజులు మారిప పోయారు. వారి ప్రాధాన్యత తగ్గి, వారు ఫిర్'ఔనుల రాజరికంలో బానిసలుగా మారిపోయారు. మరియు ఎన్నో కష్టాలకు అవమానాలకు గురి చేయబడ్డారు. వారికి స్వాతంత్ర్యం ఇప్పించటానికి అల్లాహ్ (సు.తా.) మూసా ('అ.స.)ను ప్రవక్తగా చేసి పంపాడు.