[1] వారు అల్లాహ్ (సు.తా.)కు కుమార్తెలను మరియు తమకేమో కుమారులను ఎన్నుకుంటున్నారు. చూడండి, 16:57-59.
[1] ప్రతివిధంగా బోధించాము: అంటే పూర్వకాలపు ప్రజల కథలు చెప్పి, ఉదాహరణలు, ఉపమానాలు ఇచ్చి, హితబోధలు చేసి, పర్యవసానాలు చూపి, అనేక విధాలుగా అల్లాహ్ (సు.తా.) ఖుర్ఆన్ లో బోధించాడు, భయపెట్టాడు. బహుశా మానవులు గుణపాఠం నేర్చుకొని, అతి స్వల్పకాలపు ఈ జీవితంలో విశ్వసించి, సత్కార్యాలు చేసి, రాబోయే శాశ్వత జీవితంలో ఎడతెగని సుఖసంతోషాలు పొందాలని. కాని చాలా మంది దానిని అర్థం చేసుకోలేక పోతున్నారు. తమ భ్రష్టాచారాలను మరింత అధికం చేసుకుంటున్నారు.
[1] ఈ ఆయత్ ను వ్యాఖ్యాతలు రెండు విధాలుగా బోధించారు: (1) ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది రాజులు ఉంటే, వారిలో ప్రతి ఒక్కడు భూమిలో ప్రతి చోటా తన అధికారాన్నే నెలకొల్పటానికి పాటు పడతాడు. అదే విధంగా ఈ ఇతర దేవతలు కూడా ప్రయత్నించేవారు, ఒకవేళ వారు ఉండి ఉంటే! అది ఇంత వరకు జరుగలేదు. అంటే అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక విశ్వసామ్రాజ్యాధిపతి లేడు. (2) ఏ విధంగానైతే ముష్రికులు భావిస్తున్నారో: వారు ఆరాధించేవారు ఇంత వరకు అల్లాహ్ (సు.తా.) సాన్నిహిత్యాన్ని పొంది ఉన్నారు మరియు తమను ఆరాధించే వారిని కూడా అల్లాహ్ (సు.తా.) దగ్గరకు తీసుకుపోవటానికి ప్రయత్నిస్తారు. ఇది సత్యం కాదు. ఈ విషయం అల్లాహుతా'ఆలా తన గ్రంథం (ఖుర్ఆన్)లో ఎన్నో సార్లు విశదం చేశాడు. చూడండి, 17:57.
[1] చూడండి, 6:25 మరియు 2:7.
[1] వారు దైవప్రవక్త ('స'అస) ను మాంత్రికుడు, మంత్రజాలానికి గురి అయినవాడు, పిచ్చివాడు, జ్యోతిష్యుడు అని నోటికి వచ్చినట్లు ఆరోపించారు. ఎందుకంటే వారు మార్గభ్రష్టులైన వారు కాబట్టి వారెన్నడూ మార్గదర్శకత్వం పొందలేరు.