[1] అల్లాహుతా'ఆలా ఈ ఆయత్ లో తన ఆరాధన తరువాత, రెండో స్థానంలో, తమ తల్లిదండ్రులతో మంచిగా వ్యవహించాలని ఆజ్ఞాపించాడు. దీనితో వారి ఆదరణ, ఆజ్ఞాపాలన మరియు వారికి వినయవిధేయతలు చూపటం ఎంత ముఖ్యమో తెలుస్తోంది.
[1] ఇక్కడ విశదమయ్యేది ఏమిటంటే మన సంపత్తిలో దగ్గరి బంధువులకు, పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది. కావున వారికి ఇవ్వటం, వారిని కనికరించటమని భావించరాదు. వారికి, వారి హక్కు ఇవ్వని వారు అల్లాహుతా'ఆలా దృష్టిలో నిందార్హులు. ఈ ఆయత్ లో పేర్కొన్నట్లు ధన సహాయానికి మొట్టమొదటి హక్కుదార్లు, దగ్గరి బంధువులు, ఎవరి పోషణైతే విధి కాదో వారు, తరువాత పేదవారు ఆ తరువాత బాటసార్లు అని తెలుస్తోంది.