[1] మ'హా ప్రవక్త ('స'అస) మదీనాకు వలస పోయిన తరువాత 16, 17 నెలలు బైతుల్ మఖ్దిస్ వైపునకు ముఖం చేసి నమాజ్' చేసేవారు. కాని అతని కోరిక క'అబహ్ (మక్కా) వైపుకు మాత్రమే ముఖం చేసి నమాజ్' చేయాలని ఉండేది. ఇదే ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఖిబ్లా కూడాను. మహా ప్రవక్త ('స'అస) దీనికై ఎన్నోసార్లు అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థించారు. చివరకు అల్లాహుతా'ఆలా ఖిబ్లాను మార్చమని మహా ప్రవక్త ('స'అస)కు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు అవిశ్వాసులు ఈ విధంగా అన్నారు.
[1] చూడండి, 22:78 మరియు 'స. బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 14. మథ్యస్థ సమాజం అంటే, ఇస్లాంకు ముందున్న మతస్థులలో కొందరు ఆత్మశుద్ధిని వదలి దేహాన్నే పోషించుకుంటూ పశుప్రాయులై ఉండేవారు. వారు యూదులు మొదలైన వారు. మరి కొందరు దేహాన్ని హింసించుకుంటూ అనేక బాధలు పడి, సంసారాన్ని వదలి అడవులలో నివసిస్తూ ఆత్మశుద్ధిని గురించి కృషి చేసేవారు. ఈ రెండు మార్గాలకు మధ్య ఇహ-పరాలను, దేహాన్ని-ఆత్మశుద్ధిని అనుసరించేవారు శ్రేష్టులు. ఇదే ఇస్లాం బోధన, ఉత్తమమైన మధ్యస్థ మార్గము. [2] ఇక్కడ దీని అర్థం : ఇంత వరకు ము'హమ్మద్ ('స'అస) మరియు అతని అనుచరులు (ర'ది.'అన్హుమ్) బైతుల్ మఖ్దిస్ వైపునకు ముఖం చేసి, చేసిన నమాజులు వ్యర్థం కావు. వాటి ప్రతిఫలం పూర్తిగా ఇవ్వబడుతుంది.
[1] పూర్వ గ్రంథాలలో మక్కాలోని కాబాయే చివరి ప్రవక్త యొక్క భిబ్లా కాగలదని పేర్కొనబడింది. వారికిది తెలిసి కూడా అసూయ వల్ల వారిలా ముస్లింలతో వాదులాడారు.
[1] యూదుల భిబ్లా బైతుల్ మఖ్దిస్ కు పడమర దిక్కులో ఉన్న 'బండ' మరియు క్రైస్తవుల ఖిబ్లా బైతుల్ మఖ్దిస్ కు తూర్పు దిక్కులో ఉంది. చూడండి, 2:115, 142, 177.