[1] 'ఖ'జరజ్ తెగకు చెందిన ఒక మదీనా వాసుడు అబూ'ఆమిర్ క్రైస్తవుడవుతాడు. అతడు 3వ హిజ్రీలో జరిగిన ఉహుద్ యుద్ధంలో మక్కా ఖురైషులకు సహాయపడి, ఆ యుద్ధం తరువాత సిరియాకు పారిపోతాడు. అతుడ బైజాన్ టైన్ చక్రవర్తి హిరాక్లియస్ ను మదీనా పై దండయాత్ర చేయటానికి ప్రోత్సహిస్తాడు. మదీనాపై వారు రాకూడదని దైవప్రవక్త ('స'అస) వారిని ఎధుర్కొనటానికి తబూక్ కు బయలుదేరే సమయంలో అతడి అనుచరులు వచ్చి: "మేము మదీనా-ఖుబాల మధ్య ఒక మస్జిద్ నిర్మించాము. మీరు వచ్చి అందులో నమా'జ్ చేయించండి." అని కోరుతారు. దైవప్రవక్త ('స'అస): "తబూక్ నుండి వచ్చిన తరువాత వస్తాను." అని అంటారు. ఆ సందర్భంలో తబూక్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఈ ఆయత్ లు అవతరింపజేయబడ్డాయి. దైవప్రవక్త ('స'అస) తరువాత దానిని పడగొట్టిస్తారు. ఎందుకంటే ఆ మస్జిద్ నిర్మాణ లక్ష్యం విశ్వాసుల మధ్య భేదభావాలు పుట్టించడే ఉండెను.
[1] చూడండి, 'స. బు'ఖారీ, పు-4, 'హ. 352, పు-5, 'హ 377, మరియు పు-3, 'హ 3462.