[1] చూడండి, 15:29, 38:72 మరియు 32:9.
[1] ఉమ్మతున్: అంటే ధర్మం లేక సమాజం. ఇక్కడ ఇస్లాం ధర్మం మరియు సమాజం. దీని వైపునకే ప్రవక్తలందరూ తమ ప్రజలను ఆహ్వానించారు. ప్రవక్తలందరి ధర్మం ఇస్లామే! దైవప్రవక్త ప్రవచనం: 'ప్రవక్తలందరి కుటుంబం ఒక్కటే, మా తండ్రి ఒక్కడు మరియు మా తల్లులు వేరు వేరు. మా అందరి ధర్మం ఒక్కటే, ఇస్లాం.' (ఇబ్నె-కసీ'ర్).
[1] చూడండి, 18:94-98. తీర్పుదినం దగ్గరికి వచ్చి 'ఈసా ( 'అ.స.) తిరిగి భూలోకంలోకి వచ్చినప్పుడు యూ'జూజ్ మరియు మా'జూజ్ లు ప్రపంచంలో ప్రతిచోట వ్యాపించి ఉంటారు. వారి హింసలు మరియు దౌర్జన్యాలకు విశ్వాసులు తాళ లేకపోతారు. చివరకు 'ఈసా ('అ.స.) విశ్వాసులను తీసుకొని 'తూర్ పర్వతం పైకి ఎక్కుతారు. అతను యా'జూజ్ మరియు మా'జూజ్ లను శిక్షించటానికి అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థిస్తారు. అప్పుడు వారంతా వధింపబడతారు. వారి శవాల దుర్వాసన అంతటా వ్యాపించి పోతుంది. అప్పుడు అల్లాహ్ (సు.తా.) పక్షులను పంపుతాడు. అవి ఆ శవాలను సముద్రంలోకి విసరుతాయి. ఆ తరువాత ఒక పెద్ద వర్షం కురుస్తుంది. దానితో భూమి శుభ్రపరచబడుతుంది. ('స'హీ'హ్ 'హదీస్'ల ఆధారంగా, ఇబ్నె-కసీ'ర్).
[1] ఒక 'హదీస్' ప్రకారం ఈ ఆయత్ విని ఒక ముష్రికుల నాయకుడు అన్నాడు: 'యూదులు మరియు క్రైస్తవులు ఆరాధించే 'ఉ'జైర్ ('అ.స.) మరియు 'ఈసా ('అ.స.) లు కూడా నరకానికి పోతారా+?' దానికి దైవప్రవక్త ('సఅ'స) అన్నారు: 'అల్లాహ్ (సు.తా.)కు బదులుగా తనను ఆరాధించటాన్ని సమ్మతించిన ప్రతి వ్యక్తి, తనను ఆరాధించిన వారితో పాటు నరకానికి పోతాడు.'