[1] తబూక్ దండయాత్ర కొరకు, ఆర్థిక మరియు భౌతిక స్తోమత గల వారంతా బయలుదేరాలని ప్రకటన చేయబడి ఉండెను. ఎందుకంటే అప్పుడు వారికి ఒక గొప్ప సామ్రాజ్యపు సేనతో యుద్ధం చేయవలసి ఉండెను. లేనిచో వారు మదీనాపై దాడి చేయటానికి యత్నాలు చేయచుండిరి. కాని అన్ని యుద్ధాలలో, అందరూ పాల్గొనే అవసరముండదు. అలాంటప్పుడు కొందరు యుద్ధానికి పోకుండా ధర్మజ్ఞానం పెంపొందించుకోవటానికి పోయి, తిరిగి వచ్చి తమ ప్రాంతంలోని ప్రజలకు ధర్మజ్ఞానం బోధించాలి. దీని వల్ల ప్రజలలో దైవభీతి పెరుగుతుంది.