[1] తబూక్ దండయాత్రలో పాల్గొనని ఆ ముగ్గురు, క'అబ్ ఇబ్నె మాలిక్, మరారా ఇబ్నె రబీ మరియు హిలాల్ ఇబ్నె 'ఉమయ్యా (ర'ది.'అన్హుమ్) అనే అన్ సారులు. వీరు, పై ఆయత్ అవతరింప జేయబడేవరకు దైవప్రవక్త ('స'అస) మరియు అతని అనుచరులతో బహిష్కరించబడి ఉండిరి. వీరి పశ్చాత్తాపం యాభై రోజుల తరువాత అంగీకరించబడింది. వీరు విధేయులైన ముస్లింలు. ఇంతకు ముందు ప్రతి యుద్ధంలో పాల్గొన్నారు. తబూక్ దండయాత్రలో కేవలం సోమరితనం వల్లనే పాల్గొన లేక పోయారు. వారు కపటవిశ్వాసుల వలే బూటక సాకులు చెప్పలేదు. (చూడండి 'స'హీ'హ్ బు'ఖారీ, కితాబ్ అల్ మ'గాజీ, బాబ్ 'గజ్ వత్ అత్ తబూక్. ముస్లిం కితాబ్ అత్-తౌబహ్, బాబ్ 'హదీస్ తౌబతు క'అబ్ బిన్ మాలిక్).