[1] మక్కా ముష్రికులు ఉ'హుద్ యుద్ధరంగం నుండి వెనుదిరిగి కొంతదూరం పోయిన తరువాత: "మేము భీతిపరులైన ముస్లిములను, పూర్తిగా అణచకుండానే తిరిగి వచ్చి తప్పు చేశాము. 300 మైళ్ళ నుండి వచ్చి కూడా యుద్ధఖైదీలను గానీ, విజయధనం గానీ, పొందకుండా తిరిగి పోతున్నాము. కావున తిరిగి మదీనాపై దాడి చేద్దామని, సమాలోచనలు చేస్తారు. కాని వారికి ధైర్యం చాలదు. దైవప్రవక్త ('స'అస) కూడా పారిపోయే శత్రువును వెంబడించి నశింపజేయాలని, 70 మంది వీరులను తీసుకొని - వారు గాయపడి ఉన్నా తయారయ్యి - వారిని వెంబడిస్తారు. వారు మదీనా నుండి 8 మైళ్ళ దూరంలో ఉన్న'హమ్రా' అల్ అసద్ అనే ప్రాంతం వరకు పోతారు. శత్రువులను పొందక, వారిక మరలిరారని నిశ్చితులైన తరువాత తిరిగి వస్తారు.