[1] ఇది 9వ హిజ్రీ విషయం. నజ్రాన్ నుండి క్రైస్తవ బృందం ఒకటి దైవప్రవక్త ('స'అస) తో కలవటానికి మదీనాకు వస్తుంది. వారికి 'ఈసా (అ.స.) గురించి ఉన్న మూఢ విశ్వాసాలను గురించి వాదవివాదాలు జరిగిన తరువాత, దైవప్రవక్త ('స'అస) శపథం (ముబాహలహ్) కొరకు సిద్ధపడ్తారు. ముబాహలహ్ అంటే, తమ తమ కుమారులను మరియు స్త్రీలను ఒకచోట చేర్చి: "ఎవరు అసత్యం పలుకుతున్నారో వారు అల్లాహ్ (సు.తా.) శాపానికి పాత్రులై నశించిపోవు గాక!" అని అల్లాహుతా'ఆలా పేరుతో శపథం చేయటం. శపథం చేయటానికి భయపడి, ఆ క్రైస్తవ నాయకులు జి'జ్ యా ఇవ్వటానికి అంగీకరిస్తారు.