[1] చూడండి, 40:18.
[1] అంటే సత్యతిరస్కారుడు ఎన్ని మంచిపనులు, సత్కార్యాలు చేసినా అవి పరలోకంలో ఎండమావులుగా అదృశ్యమైపోతాయి. అంటే అతనికి వాటి నుండి ఎట్టి పుణ్యఫలితం లభించదు. అతడు నరకంతో చేరిపోతాడు.
[1] సత్యరిరస్కారులను సముద్రపులోతులో చీకట్లలో ఉన్నవాటితో పోల్చబడింది. అంటే సత్యతిరస్కారుడు అంధకారంలో మునిగి ఉన్నాడు. అవి వానిని విశ్వాసపు వెలుగులోనికి రానివ్వవను. పరలోకంలో కూడా వాడు నరకపు అంధకారంలో ఉంటాడు.
వెలుగు సముద్రపు లోతుతోకి చేరలేదు. ఎందుకంటే వెలుగులో ఇమిడి ఉన్న ఏడు రంగులు ఒకదాని తరువాత ఒకటి, సముద్రపు తలాలలోనికి వెలుగు పోయేటప్పుడు పీల్చుకోబడతాయి. కాబట్టి సముద్రపు లోపటి భాగంలో చీకటి ఉంటుందని సైంటిస్టులు ఇప్పుడిప్పుడే తెలుసుకున్నారు. కాని ఇది దివ్యఖుర్ఆన్ లో 1400 వందల సంవత్సరాల ముందే వ్రాయబడింది.
[1] అంటే ప్రతి దానికి అల్లాహ్ (సు.తా.) యొక్క స్తోత్రం (ప్రార్థన) ఏ విధంగా చేయాలో తెలుసు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేయడమనేది కూడా అల్లాహ్ (సు.తా.) ఘనతలలో ఒకటి. ఏ విధంగానైతే వాటిని సృష్టించడం కూడా కేవలం ఆయన (సు.తా.) ఘనతలలో ఒకటో! చూడండి, 17:44.
[2] విచక్షణాశక్తి లేని ప్రతివస్తువు కూడా అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేస్తుంది. అలాంటప్పుడు ఈ విచక్షణాశక్తి గల జిన్నాతులు మరియు మానవులు కూడా అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేయకుంటే వారు ఆయన శిక్షకు అర్హులు కాగూడదా ?