[1] ఆ భూమి పేరు 'తై' మైదానం. నలభై సంవత్సరాల వరకు యూదులు ఆ మైదానంలో తిరుగుతూ ఉండి, చివరకు ఫలస్తీన్ లోకి ప్రవేశించినప్పుడు మూసా ('అ.స.) అనుచరులలో కేవలం ఈ ఇద్దరు పెద్దలే మిగిలారు. యూషా బిన్-నూన్, మూసా ('అ.స.) తరువాత, అతని స్థానంలో 'ఖలీపా అయ్యారు. కాలిబ్ బిన్-యూ'హన్నా అతనికి కుడిభుజం అయ్యారు.
[1] హాబిల్ మరియు ఖాబిల్ ఆదమ్ ('అ.స.) యొక్క ఇద్దరు కుమారులు. బైబిల్ లో వీరు ఏబిల్ (Abel) మరియు కేన్ (Cain)గా పేర్కొనబడ్డారు. హాబిల్ (Abel) ను ఖాబిల్ (Cain) చంపాడు.