నిశ్చయంగా, (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించిన వారి మరియు యూదులు, సాబీయులు, క్రైస్తవులు, మజూసీలు[1] మరియు బహుదైవారాధకులు అయిన వారి మధ్య పునరుత్థాన దినమున అల్లాహ్ తప్పక తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానికి సాక్షిగా ఉంటాడు.
[1] అల్-మజూసు: (Magians / Zoroastrians) అంటే మజూసీలు. వారు Zerdusht అనే ఈరాన్ ప్రవక్తను అనుసరిస్తారు. వారి గ్రంథం పేరు, Zend-Avesta, వీరు రెండు ఆరాధ్య దైవాలున్నాయి అంటారు. ఒకటి చీకటి, రెండోది వెలుగు. వీరు ఈరాన్ లో మరియు ఇండియా పాకిస్తాన్ లలో ఉన్న పార్సీలు. వీరు అగ్నిని పూజిస్తారు. కాని అల్ల్హాహ్ (సు.తా.) సర్వసృష్టికి మూలాధారుడు అని కూడా విశ్వాసిస్తారు.
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, సర్వవృక్షరాశి, సర్వ జీవరాశి మరియు ప్రజలలో చాలా మంది, అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారని?[1] మరియు చాలా మంది శిక్షకు కూడా గురి అవుతారు. మరియు అల్లాహ్ ఎవడినైతే అవమానం పాలు చేస్తాడో, అతడికి గౌరవమిప్పించ గలవాడు ఎవ్వడూ లేడు. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు.
ఆ రెండు విపక్ష తెగల వారు తమ ప్రభువును గురించి వాదులాడారు, కావున వారిలో సత్యతిరస్కారులకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి (కుట్టించబడి) ఉంటాయి, వారి తలల మీద సలసలకాగే నీరు పోయబడు తుంది.[1]
[1] కొందరు వ్యాఖ్యాతలు వీరిని, విశ్వాసులు మరియు సత్యతిరస్కారులతో పోల్చారు. ఇతరులు బద్ర్ యుద్ధంలో పోరాడిన విశ్వాసులు మరియు ముష్రికులైన మక్కా ఖురైషులతో పోల్చారు. ఇబ్నె-కస'ర్ (ర'హ్మ) ఈ రెండు వ్యాఖ్యానాలు సరైనవే అంటారు.
ప్రతిసారి వారు దాని (ఆ నరకం) నుండి దాని బాధ నుండి బయట పడటానికి ప్రయత్నించి నప్పుడల్లా తిరిగి అందులోకే నెట్టబడతారు. మరియు వారితో : "నరకాగ్నిని చవి చూడండి!" (అని అనబడుతుంది).
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని అల్లాహ్ క్రింద సెలయేళ్ళు ప్రవహంచే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారికి బంగారం మరియు ముత్యాలతో చేయబడిన కంకణాలు తొడిగింప బడతాయి. అక్కడ వారి కొరకు పట్టు వస్త్రాలు ఉంటాయి.[1]
[1] ఈ ఆటంకపరచే వారు, మక్కా ముష్రికులు. వీరు 6వ హిజ్రీలో దైవప్రవక్త ('స'అస) మరియు అతని అనుచరులను (ర'ది.'అన్హుమ్) మక్కాలో ప్రవేశించకుండా ఆపారు. మరియు వారు హుదైబియా నుండి మరలిపోయారు.