[1] పునరుత్థాన దినమున ఆదమ్ ('అ.స.)తో ఇలా అనబడుతుంది: "నీ సంతానం నుండి నరకం వారిని ఎన్నుకో." అతను ప్రశ్నిస్తాడు : "ఓ అల్లాహ్ (సు.తా.)! ఏ విధంగా?" అల్లాహ్ (సు.తా.) అంటాడు : "ప్రతి వేయిమంది నుండి 999 మందిని, అప్పుడు గర్భవతులైన స్త్రీల పిండాలు పడిపోతాయి మరియు పిల్లలు వృద్ధులై పోతారు." ఈ విషయం విని అనుచరు (ర'ది.'అన్హుమ్)లు చాలా చింతలో పడిపోయారు.అప్పుడు దైవప్రవక్త ('స'అస) అంటారు: "యాజూజ్ మాజూజ్ జాతి వారి నుండి 999 ఉంటారు. మరియు మీలో నుండి ఒకడు; అల్లాహ్ (సు.తా.) కరుణ పై నాకు విశ్వాసముంది. స్వర్గవాసులలో నుండి సగం మంది మీరుంటారు." ('స.బు'ఖారీ)
[1] అల్లాహ్ (సు.తా.) మిమ్మల్ని కనికరించాడు కావున, తహజ్జుద్ లో మీకు సులభమైనంతనే పఠించండి. రెండు రకాతులైనా సరే. దైవప్రవక్త చాలా మట్టుకు ఎనిమిది రకాతులు చేసేవారు. అతనినే అనుసరించినా ఎంతో మేలు. మీ తహజ్జుద్ నమాజ్ లో వీలైనంత ఖుర్ఆన్ పఠనం చేయండి. నెమ్మదిగా స్పష్టంగా పఠించండి.
[2] అంటే ఐదు సార్లు చేసే ఫ'ర్ద్ నమాజులు. చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయంలోఈ ఆయత్ మదీనాలో అవతరింపజేయబడింది.