[1] ఒకసారి కొందరు 'స'హాబీలు జిహాద్ కొరకు పోతుంటారు. దారిలో ఒక పశువుల కాపరి వారిని చూసి సలామ్ చేస్తాడు. వారు అతడు విశ్వాసికాడు, కేవలం తన ప్రాణాలను కాపాడుకోవటానికే - తాను ముస్లింనని తెలుపటానికి - సలాం చేశాడని భావించి, అతనిని చంపి, అతని పశువులను, మాలె 'గనీమత్ గా దైవప్రవక్త ('స'అస) దగ్గరికి తెస్తారు. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ('స. బు'ఖారీ, తిర్మిజీ').