[1] చూడండి, 4:80.
[1] 'గిఫార్, ముజైనహ్, జుహైనహ్, అష్ జా'అ, అస్ లమ్, దయల్ అనే బద్దూ తెగల వారు, సాకులు చెప్పారు. వారు ఆయుధాలు లేకుండా మక్కా వెళ్ళితే మక్కా ముష్రికులు వారిని చంపవచ్చని భయపడ్డారు. అందుకే దైవప్రవక్త ('స'అస) కు 'హుదైబియహ్ ఒప్పందం చేసుకోవలసి వచ్చింది.
[1] ఇక్కడ 'ఖైబర్ యుద్ధ ప్రస్తావన ఉంది. అది 7వ హిజ్రీలో జరిగింది. 'హుదైబియా ఒప్పందం తరువాత సూరహ్ అల్-ఫ'త్హ్ అవతరింపజేయబడింది. అది విని 6వ హిజ్రీలో సాకులు చెప్పి మక్కాకు 'ఉమ్మా కొరకు రానివారు - విజయధనపు ఆశతో - 'ఖైబర్ యుద్ధంలో పాల్గొనటానికి అనుమతి అడుగుతారు. అప్పుడు దైవప్రవక్త ('స'అస), కేవలం 6వ హిజ్రీలో 'ఉమ్రా కొరకు మక్కాకు పోయినవారు మాత్రమే 'ఖైబర్ కు పోవాలని. సెలవిస్తారు.
[2] చూడండి, 8:1.