వెనుక ఉండిపోయిన ఎడారి వాసులు (బద్దూలు)[1] నీతో ఇలా అంటారు: "మా ఆస్తిపాస్తుల మరియు మా ఆలుబిడ్డల చింత మాకు తీరిక లేకుండా చేశాయి. కావున మా క్షమాపణకై ప్రార్థించండి!" వారు తమ హృదయాలలో లేనిది తమ నాలుకలతో పలుకుతున్నారు. వారితో ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ మీకు నష్టం చేయదలిస్తే, లేదా లాభం చేయదలిస్తే, ఆయన నుండి మిమ్మల్ని తప్పించగల శక్తి ఎవరికుంది? వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును!
[1] 'గిఫార్, ముజైనహ్, జుహైనహ్, అష్ జా'అ, అస్ లమ్, దయల్ అనే బద్దూ తెగల వారు, సాకులు చెప్పారు. వారు ఆయుధాలు లేకుండా మక్కా వెళ్ళితే మక్కా ముష్రికులు వారిని చంపవచ్చని భయపడ్డారు. అందుకే దైవప్రవక్త ('స'అస) కు 'హుదైబియహ్ ఒప్పందం చేసుకోవలసి వచ్చింది.