[1] మీరు మీ వ్యవహారాలలో మీ తోటివారితో, మీ బంధువులతో, స్నేహితులతో సంప్రదింపులు చేయండి. కాని చివరకు నిర్ణయం తీసుకునేటప్పుడు అల్లాహ్ (సు.తా.) పై ఆదారపడండి. మీకు మంచిది అనిపించిన నిర్ణయం తీసుకోండి.
[1] ఉ'హుద్ యుద్ధం రోజు దైవప్రవక్త ('స'అస) విలుకాండ్రను: ఎట్టి పరిస్థితిలో కూడా వారు తమ స్థలాలను వదలరాదని, ఆదేశిస్తారు. కాని వారు యుద్ధబూటీ వ్యామోహంలో తమ స్థానాలను వదలి యుద్ధబూటీ ప్రోగు చేయటానికి వెళ్తారు. కార్యాన్నే ఖండిస్తూ, అల్లాహ్ (సు.తా.) అన్నాడు: "ఏ ప్రవక్త కూడా తన తోటివారికి అన్యాయం చేయడు." కాబట్టి వారు తమ ప్రవక్తయందు విశ్వాసముంచుకొని, బూటీలోని తమ హక్కు తమకు తప్పక దొరుకుతుందని, తమ చోట్లలో స్థిరంగా ఉండటమే వారి కర్తవ్యము. ఈ ఆయత్ ప్రతి వ్యవహారానికి వర్తిస్తుంది.
[1] చూడండి, 2:79 మరియు 3:78.
[1] చూడండి, 12:109, 25:20 మరియు 41:6. [2] ఇక్కడ ప్రవక్త ('అలైహిమ్ స.)ల మూడు ముఖ్య లక్ష్యాలు వివరించబడ్డాయి : 1) ఆయత్ లను చదువటం మరియు వినిపించటం, 2) త'జ్ కియా: అంటే మానవుల కర్మలను, విశ్వాసా('అఖాయద్)లను మరియు నడవడిక ('అఖ్ లాఖ్)లను సరిదిద్దటం మరియు 3) గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధించటం.
[1] ఉ'హుద్ లో 70 మంది ముస్లింలు మరణించారు, కానీ బద్ర్ లో 70 మంది ముష్రికులు మరణించారు, మరియు 70 మంది బందీలయ్యారు కదా! [2] అంటే దైవప్రవక్త ('స'అస) యొక్క ఆజ్ఞను పాలించక 'స'హాబా (ర'ది.'అన్హుమ్)లు బూటీ కొరకు గుట్టపై నుండి తమ స్థానాలు వదలిపోయినందుకు ఈ ఆపదకు గురి అయ్యారు.