[1] 'సాబీయీ'న్: ఒక గతించిన సమాజం. వారు ము'సల్ ('ఇరాఖ్)లో నివసించేవారు. "అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు." అని నమ్మేవారు. వారు 'జబూర్ గ్రంథాన్ని చదివే వారని కొందరి అభిప్రాయం. వారు యూదులు గానీ, క్రైస్తవులు గానీ కారు. తరువాత వారి ధర్మంలో కూడా మార్పులు వచ్చాయి. వారు దైవదూతలను మరియు నక్షత్రాలను ఆరాధించసాగారు. వారు తరువాత ఏ ధర్మాన్ని కూడా అనుసరించకుండా ఉండసాగారు. వారు నాస్తికులు (Atheists) అయ్యారని కొందరి అభిప్రాయం. [2] చూడండి 5:69. ఇక్కడ యూదులు, క్రైస్తవులు మరియు 'సాబీయులు, అంటే తమ గ్రంథాలలో ఎట్టి మార్పులు చేయక, వాటి అవతరింప జేయబడిన నిజరూపంలో వాటిని అనుసరించిన వారని అర్థం. మహాప్రవక్త ('స'అస) ప్రవచనం: "ఎవరి చేతిలోనయితే నా ప్రాణం ఉందో ఆ పరమ పవిత్రుని సాక్షి, నా ఈ సమాజంలో నా మాట విన్న వ్యక్తి, వాడు యూదుడు గానీ, క్రైస్తవుడు గానీ నన్ను (నా ధర్మాన్ని) విశ్వసించకపోతే! అతడు నరకవాసి అవుతాడు." (స'హీ'హ్ ముస్లిం). అంటే ము'హమ్మద్ ('స.అస) తరువాత, ఇస్లాం తప్ప మరొక ధర్మాన్ని అల్లాహ్ (సు.తా.) సమ్మతించడు. ఇక్కడ మరొక విషయం స్పష్టమయ్యేది ఏమిటంటే 'స'హీ 'హ్ 'హదీసు'లను విడిచి ఖుర్ఆన్ ను సరిగ్గా అర్థం చేసుకోవటం అసాధ్యం, ('తబరీ, పు-1, పేజీ - 323). చూ. 3:19, 3:85.
[1] యూదులకు శనివారం (సబ్ త్) రోజున చేపలు పట్టటం నిషేధించబడింది. వారు ఆ శాసనాన్ని ఉల్లంఘించటం వలన: 'నీచులైన కోతులు కండి.' అని శపించ బడ్డారు. చూడండి, 5:60, 7:166.
[1] ఇస్రాయీ'ల్ సంతతి వారిలో ఒక ధనవంతుడు - ఒకే ఒక్క వారసునిగా ఉన్న - అతని సోదరుని కుమారుణ్ణి హత్య చేసి, శవాన్ని ఇతరుని ఇంటి ముందు వేస్తాడు. ఉదయం ఆ యిద్దరి మధ్య వాదులాట జరుగుతుంది. పరిష్కారానికి వారు మూసా ('అ.స.) దగ్గరికి వస్తారు. అతను వారిని ఒక ఆవును బలి ఇచ్చి దాని మాంసపు ముక్కతో ఆ మృతుని శరీరాన్ని కొడితే, అతడు తన హతుణ్ణి చూపిస్తాడంటారు. ఎంతో వాదులాడిన తరువాత వారు ఈ విధంగా చేస్తారు. ఆ మృతుడు లేచి హతుణ్ణి చూపించి తిరిగి మరణిస్తాడు (ఫ'త్హ అల్-ఖదీర్).