మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని[1] (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.
[1] దీని అర్థమేమిటంటే, ప్రతి ప్రవక్త తన తరువాత వచ్చిన సందేశహరుణ్ణి అనుసరించాలి. ఒకవేళ వారిద్దరూ ఒకేసారి సజీవులై ఉన్నా సరే! ఉదాహరణకు యహ్యా('అ.స.) తన తరువాత వచ్చిన 'ఈసా ('అ.స.)ను అనుసరించారు. ప్రవక్తలు ప్రమాణం చేశారంటే వారిని అనుసరించే ప్రజలు కూడా తమ ప్రవక్తల ప్రమాణాన్ని శిరసావహించాలి.