[1] యూసుఫ్ ('అ.స.) మరియు బెన్యామీన్ తల్లి రాచెల్ (Rachel), బెన్యామీన్ పుట్టిన తరువాత మరణించింది. కావు ఇక్కడ అతన తండ్రితో పాటు వచ్చిన ఆమె అతని తల్లి చెల్లెలు. తల్లి మరణించిన తరువాత య'అఖూబ్ ('అ.స.) ఆమె చెల్లెలను వివాహమాడారని కొందరు వ్యాఖ్యాతలు అంటారు. (ఫ'త్హ అల్ ఖదీర్). కాని ఇమామ్ ఇబ్నె జరీర్ 'తబరీ ('ర'హ్మ) అభిప్రాయమేమిటంటే, యూసుఫ్ ('అ.స.) తల్లి బ్రతికి ఉండెను. ఆమె తన భర్త వెంట వచ్చింది, (ఇబ్నె-కసీ'ర్).
[1] ఈ సాష్టాంగం కేవలం ఒకరి పట్ల ఉన్న గౌరవాన్ని చూపటానికి చేసింది. ఈ విధంగా గౌరవం చూపడం య'అఖూబ్ ('అ.స.) షరీయత్ లో అనుమతించబడి వుండెను. కాని ము'మ్మద్ ('స'అస) షరీయత్ లో గౌరవార్థం కూడా ఎవరి ముందైనా సాష్టాంగం చేయటం ధర్మసమ్మతం కాదు. [2] ఈజిప్టుతో పోల్చితే ఆ కాలంలో కానాన్ ఒక ఎడారి మాదరిగానే ఉండెను. అల్ బద్ వు: ఎడారి, (చూ. 12:100); అల్ బాదు: ఎడారి వాసుడు, (చూ. 22:25); బాదూన్ (బ.వ.) : ఎడారి వాసులు ( చూ. 33:20). అల్ అ'అరాబ్, అంటే, కూడా ఎడారివాసులు (బద్దూలు, చూ. 9:90).
[1] ఇక్కడ అల్లాహ్ (సు.తా.) విశదీకరించేది ఏమిటంటే, కొందరు సత్యతిరస్కారులు నిందమోపినట్లు ఈ విషయాలు ము'హమ్మద్ ('స'అస) ఎవరితోనో విని నేర్చుకున్నవి కావు. ఎందుకంటే ఇవి క్రైస్తవుల మరియు యూదుల కథలకు భిన్నంగా ఉన్నాయి. ఇంకా అల్లాహ్ (సు.తా.) ఇక్కడ సాక్ష్యమిస్తున్నాడు: "ఇవి దైవప్రవక్త ('స'అస)కు వ'హీ ద్వారా తెలుపుతున్నాను," అని. మరొక విషయం ఏమిటంటే ప్రవక్తలకు కూడా అల్లాహ్ (సు.తా.) తెలిపినది తప్ప, అగోచర విషయాల జ్ఞానం ఉండదు. ఇంకా ఇతర చోట్లలో కూడా అల్లాహ్ (సు.తా.) అన్నాడు: "ఓ ము'హమ్మద్ ('స'అస)! నీకు అగోచర విషయాల జ్ఞానం లేదు." (చూడండి, 3:17, 44; 28:45-46; 38:69-70).
[1] అల్లాహ్ (సు.తా.) తన ప్రవక్తల ద్వారా, ప్రజలకు గడిచిన వారి వృత్తాంతాలు తెలిపి గుణపాఠం నేర్చుకొని, సత్యధర్మం (ఇస్లాం) మీద ఉండాలని బోధించాడు. అయినా ప్రజలు వాటిని కేవలం కాలక్షేపానికి మాత్రమే విన్నట్లు వింటున్నారు. గుణపాఠం నేర్చుకొని సత్యధర్మాన్ని అవలంబించే వారు తక్కువే!