[1] పూర్వప్రవక్తలు ('అలైహిమ్ స.) తమ తమ జాతులవారి వద్దకే పంపబడి వుండిరి. మూసా ('అ.స.) ఇస్రాయీ'ల్ సంతతివారి కొరకు వచ్చారని తౌరాత్ అంటుంది. 'ఈసా ('అ.స.) : "నేను దారి తప్పిన ఇస్రాయీ'ల్ సంతతి వారి కొరకు పంపబడ్డాను." అని అన్నారు. చూడండి, 5:46 వ్యాఖ్యానం 1. కాని ఇక్కడ అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: "(ఓ ము'హమ్మద్!) వారితో అను: 'ఓ మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరివైపుకు పంపబడిన సందేశహరుడను, (ర'హ్ మతల్ లిల్ 'ఆలమీన్, 21:107),' మరియు : 'ప్రవక్తలందరి ముద్రను ('ఖాతమన్నబియ్యీన్, 33:40' " [2] ఇక్కడ మరొకసారి నిరక్షరాస్యుడుగా, దైవప్రవక్తగా, ము'హమ్మద్ ('స'అస) పేర్కొనబడ్డారు. అంటే అతనికి ఏ మానవ గురువు లేడు. అతను నేర్చుకున్నది, దైవదూత జిబ్రీల్ ('అ.స.) తెచ్చిన, అల్లాహ్ (సు.తా.) దివ్యజ్ఞానం (వ'హీ), ద్వారా మాత్రమే. చూశారా! అది ఎంత మహత్త్యమైనదో! ఈనాటికి కూడా దాని వంటి ఒక్క సూరహ్ కూడా ఎవ్వరూ రచించి తేలేక పోయారు. ఎందుకంటే ఇది (దివ్యఖుర్ఆన్) మానవ రచన కాదు, అల్లాహుతా'ఆలా తరపు నుండి అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం. ఇది అల్లాహ్ (సు.తా.) ద్వారానే పునరుత్థాన దినం వరకు భద్రంగా చబడుతుందని అల్లాహుతా'ఆలా వ్యక్తం కూడా చేశాడు. చూడండి, 15:9.