[1] చాలామంది ముష్రికులు భూమ్యాకాశాల సృష్టికర్త మరియు పోషకుడు, అయిన అల్లాహ్ (సు.తా.) ను మాత్రమే నమ్ముతారు. అయినా తమ ఆరాధనలలో ఆయనకు సాటి కల్పిస్తారు. దర్గాలకు పోయి మన్నతులు చేసేవారి విషయం కూడా ఇలాంటిదే.
[1] ఇక్కడ, ప్రవక్తలందూ పురుషులే, అని విశదీకరించబడింది. స్త్రీలకు ప్రవక్త పదవి ఇవ్వబడలేదు. మరొక విషయం విశదమయ్యేదేమిటంటే, ప్రవక్తలందరూ అహ్ లల్ ఖురా' పురవాసులే కానీ అహ్ లల్ బాదియహ్ సహరా వాసులు (పల్లెటూరు వాసులు) కారు.