[1] ఇబ్రాహీమ్ ('అస) అతిథులు అతను తెచ్చిన, వేచిన ఆవుదూడ మాంసం తిననందుకు, అతను వారు తనతో శత్రుత్వం వహిస్తారేమోనని భయపడ్డారు. దీనితో విశదమయ్యే మరొక విషయమేమిటంటే ప్రవక్తలకు అకోచర జ్ఞానముండదు. అతనికి అగోచరజ్ఞానముంటే వారు దైవదూతలని అతనికి తెలిసి ఉండేది. అతను వారి కొరకు వేపిన ఆవుదూడ తెచ్చేవారు కాదు. [2] లూ'త్ ('అ.స.) ఇబ్రాహీమ్ ('అ.స.) సోదరుని కుమారులు. అతను జోర్డాన్ కు తూర్పుదిక్కు ఈనాటి లూ'త్ సముద్రం (Dead Sea) అనే ప్రాంతలో నివసించే వారు. ఇబ్రాహీమ్ ('అ.స.) వలే, లూ'త్ ('అ.స.) కూడా, దక్షిణ బాబిలోనియా (Babylonia) లోని 'ఊర్' అనే ప్రాంతవాసులు. తన పిన్నాన్నతో సహా ఇక్కడికి వలస వచ్చారు. కావున లూ'త్ (అ'.స.) ప్రజలు అంటే అతని జాతివారు కాదు, కాని పైన పేర్కొన్న ప్రాంతంలోని సోడోమ్ మరియు గొమొర్రాహ్ అనే నగరాల వాసులు.