[1] ఇక్కడ పూర్వ గ్రంథప్రజలు, అంటే యూదులు మరియు క్రైస్తవులలోని కొందరు సత్పరుషుల విషయం తెలుపబడింది. ఉదాహరణకు: 'అబ్దుల్లాహ్ బిన్-సల్లామ్, సల్మాన్ ఫార్సీ (ర'ది.'అన్హుమ్)ల వంటివారు. వారు తమ గ్రంథాలలో పేర్కొనబడిన రాబోయే ప్రవక్త ము'హమ్మద్ ('స'అస) మే అన్న సత్యాన్ని గ్రహించి, విశ్వసించి సత్యధర్మమైన ఇస్లామ్ ను స్వీకరించారు. ఏ ధర్మాన్నైతే దైవప్రవక్తలు ఆదమ్, నూ'హ్, ఇబ్రాహీమ్, మూసా మరియు 'ఈసా మొదలైనవారు ('అలైహిమ్. స.) ఆచరించి, బోధించారో!
[1] అల్లాహ్ (సు.తా.) ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఈ విన్నపాన్ని పూర్తి చేశాడు. ఇది 29:27లో పేర్కొనబడింది. [2] "నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు." అల్లాహ్ (సు.తా.) యొక్క ఈ ప్రవచనం ఎంతో ఆలోచింపదగినది. ఇక్కడ ఆయన విశదపరచింది ఏమిటంటే : ఒక మంచి సత్పురుషుని లేక ప్రవక్త సంతతికి చెందినంత మాత్రానా - వారు అవిశ్వాసులై, సత్కార్యాలు చేయని వారైతే - వారి వంశకీర్తి, వారి పెద్దల ప్రవక్తృత్వం వారికి ఏ విధంగానూ పనికిరాదు. ప్రతి ఒక్కడూ తన స్వంత విశ్వాసం మరియు సత్కార్యాల ఆధారంగానే ప్రతిఫలం పొందుతాడు. మహా ప్రవక్త ('స'అస) 'హదీస్' ఇలా ఉంది : "ఏ వ్యక్తి వ్యవహారాలైతే అతనిని వెనుక విడిచాయో, అలాంటి వ్యక్తి పుట్టు పూర్యోత్తరాలు, వంశ ప్రతిష్ఠలు అతనిని ఏ మాత్రం ముందుకు తేలేవు." ('స'హీ'హ్ ముస్లిం).
[1] మసా'బతల్లిన్నాస్ : అంటే, ప్రజల కొరకు పుణ్యస్థలం. దీని మరొక అర్థం, మాటిమాటికీ సందర్శించే కేంద్రం. ఎందుకంటే ఒకసారి అల్లాహ్ (సు.తా.) గృహాన్ని సందర్శించినవాడు, మళ్ళీ మళ్ళీ దానిని దర్శించాలని కోరుతూ ఉంటాడు. దీని మరొక మహత్త్వమేమిటంటే, ఇది శాంతి కేంద్రం. అంటే ఇక్కడ ఏ శత్రువు భయం ఉండదు. అందుకే అజ్ఞాన కాలంలో కూడా ముష్రిక్ లు 'హరమ్ సరిహద్దులలో తమ శత్రువులతో పోరాడటం గానీ, హత్యలు గానీ చేసేవారు కాదు. [2] మఖామె ఇబ్రాహీమ్: అంటే ఇబ్రాహీమ్ ('అ.స.) నిలబడిన రాయి. అతను దానిపైన నిలబడి క'అబహ్ గృహాన్ని నిర్మించారు. అది 'హరమ్ లో క'అబహ్ కు దగ్గరగా ఉంది. 'తవాఫ్ పూర్తి చేసిన వారు ప్రతి ఒక్కరూ, దాని దగ్గరలో రెండు రకా'అతులు నమా'జ్ చేస్తారు.