[1] పునరుత్థాన దినమున ఆదమ్ ('అ.స.)తో ఇలా అనబడుతుంది: "నీ సంతానం నుండి నరకం వారిని ఎన్నుకో." అతను ప్రశ్నిస్తాడు : "ఓ అల్లాహ్ (సు.తా.)! ఏ విధంగా?" అల్లాహ్ (సు.తా.) అంటాడు : "ప్రతి వేయిమంది నుండి 999 మందిని, అప్పుడు గర్భవతులైన స్త్రీల పిండాలు పడిపోతాయి మరియు పిల్లలు వృద్ధులై పోతారు." ఈ విషయం విని అనుచరు (ర'ది.'అన్హుమ్)లు చాలా చింతలో పడిపోయారు.అప్పుడు దైవప్రవక్త ('స'అస) అంటారు: "యాజూజ్ మాజూజ్ జాతి వారి నుండి 999 ఉంటారు. మరియు మీలో నుండి ఒకడు; అల్లాహ్ (సు.తా.) కరుణ పై నాకు విశ్వాసముంది. స్వర్గవాసులలో నుండి సగం మంది మీరుంటారు." ('స.బు'ఖారీ)