[1] ఆ ఆయత్ అవతరింపజేయబడినపుడు స'హాబీలు దైవప్రవక్త ('స'అస) దగ్గర హాజరై ఇలా విన్నవించుకున్నారు: "ఓ ప్రవక్తా('స'అస)! నమా'జ్, ఉపవాసం, 'జకాత్ మరియు జిహాద్ మా శక్కికి మించినవి కావు. కాని మనస్సులో పుట్టే ఆలోచనలపై మాకు అదుపు లేదు కదా! అయినా అల్లాహుతా'ఆలా వాటి లెక్క తీసుకుంటానని అంటున్నాడు కదా!" అప్పుడు దైవప్రవక్త ('స'అస) ఇలా సెలవిచ్చారు: "మీరిప్పుడు కేవలం విన్నాము మరియు విధేయుల మయ్యాము" అని మాత్రమే అనండి. అప్పుడు అల్లాహ్ (సు.తా.) ఈ ఆయత్ అవతరిపజేశాడు: "అల్లాహ్ ఏ ప్రాణిపైననూ దాని శక్తికి మించిన భారం వేయడు." (ఇబ్నె - కసీ'ర్, ఫ'త్తహ అల్ ఖదీర్). దీనిని గురించి ఇంకా ఈ 'హదీస్' కూడా ఉంది: "అల్లాహుతా'ఆలా నా ఉమ్మత్ వారి మనస్సులలో వచ్చిన విషయాలను క్షమిస్తాడు. కాని నాలుకతో పలికిన దానిని మరియు అమలు పరచిన దానిని లెక్కలోకి తీసుకుంటాడు." (బు'ఖారీ, ముస్లిం).